26.3 C
Hyderabad
Monday, August 3, 2026

మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యా రంగంలో చేసిన సేవలు మరువలేనివి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భీమ్ గల్;  నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా  భీంగల్ టౌన్ లోని  మైనారిటీ పాఠశాల నందు నిర్వహిస్తున్న కల్చరల్ ఆక్టివిటీ సందర్బంగా బెస్ట్ అటెండెన్స్ ,బెస్ట్ క్లాస్ అండ్  బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా భీంగల్ విద్యాధికారి మాట్లాడుతూ స్వాతంత్ర్య అనంతరం మౌలానా అబుల్ కాలం ఆజాద్  భారత దేశానికి మొదటి విద్య శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా విద్య పైన చాలా సేవలు అందించడం జరిగిందని పేర్కొన్నాడు. భీంగల్ లోని మైనారిటీ స్కూల్ లోని మైనారిటీ  విద్యార్థుల సంఖ్యను పెంచాలని మండల నాయకులని కొరడడం జరిగింది. అనంతరం విద్యార్థులకు  బహుమతులు ప్రదానం చేయడం జరిగింది మరియు విద్యార్థులు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘు,నరేష్ ,క్రాంతి,అతీక్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article