23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

గంజాయి కలిగిన వ్యక్తి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

  • 45 గ్రాముల గంజాయి స్వాధీనం

 

మోపాల్, బతుకమ్మ: వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్ పై గంజాయితో ప్రయాణిస్తున్న వ్యక్తిని మోపాల్ పోలీసులు పట్టుకున్నారు.  మోపాల్ ఎస్ఐ యాదగిరి కథనం ప్రకారం… మోపాల్ ప్రోహేబిషనరీ ఎస్ఐ శైలేందర్ స్థానిక పోలీసులతో కలిసి శుక్రవారం రాత్రి  మోపాల్ మండలం కంజర్ శివారులోని ఒడ్డేర కాలని వద్ధ వాహనాల తనిఖీలు చేపట్టారు. మోపాల్ మండలం శ్రీరాం నగర్ తాండాకు చెందిన బామన్ బహదుర్ సింగ్ అనే వ్యక్తి పల్సర్ పై వస్తుండగా అతడు మత్తులో ఉండగా గమనించి విచారించారు. అతని బైక్ లో 45 గ్రాముల ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గాందారి మండలం చద్మల్ గ్రామానికి చెందిన బంధువు ద్వార గంజాయి సేవించడానికి అలవాటు పడిన బహదూర్ సింగ్ గంజాయిని సేకరించి సేవిస్తున్నట్టు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి గంజాయి స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు.

More articles

Latest article