బతుకమ్మ, మోర్తాడ్: మండలంలోని సుంకేట్ గ్రామంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఏఎస్సై గోపాల్, కానిస్టేబుల్ వసంత్ లు సుంకేట్ గ్రామం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. వాటిని పీఎస్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మోర్తాడ్ ఎస్ఐ తెలిపారు.
