నిజామాబాద్, బతుకమ్మ: పాఠశాలలు శనివారం నుంచి ఒంటిపూట మాత్రమే కొనసాగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం ఆఖరి రోజైన ఏప్రిల్ 23వ తేదీ వరకు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఒంటిపూట మాత్రమే కొనసాగనున్నాయి. అలాగే ఎస్సెస్సీ పరీక్షలు కొనసాగనున్న సెంటర్ల స్కూళ్లు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతాయి.

