- రూ.లక్షా వివాహం ప్రోత్సాహం అందిస్తూ జీవో జారీ
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల దశాబ్దాల సమస్యకు ముగింపు పలుకుతూ జీవో జారీ చేసింది. గతంలో వివాహం చేసుకున్న జంటలో ఒక్కరు దివ్యాంగులు ఉంటేనే రూ.లక్షా వివాహ ప్రోత్సాహం లభించేది. ఇక నుంచి ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా రూ.లక్షా వివాహ ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి దాసరి సీతక్క చొరవతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
