- సహాయక చర్యల పురోగతి ని సీఎం కి వివరించిన అధికారులు
హైదరాబాద్, బతుకమ్మ : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మంత్రులతో కలిసి సమీక్షించారు. సొరంగంలోకి స్వయంగా వెళ్ళి సహాయక చర్యల గురించి సీఎం, మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్ష లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,జూపల్లి కృష్ణారావు,నగరకర్నూల్ ఎంపీ మల్లు రవి,అచ్చంపేట ఎంఎల్ ఏ వంశీ కృష్ణ,దేవరకొండ ఎంఎల్ ఏ బాలునాయక్,మాజీ ఎంఎల్ ఏ సంపత్ కుమార్ పాల్గొన్నారు.
