రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరగుతున్నాయి. ఈసందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గన్పార్క్ వద్ద అమరవీరుల స్థూపం దగ్గర సీఎం నివాళులర్పించారు. సీఎంతో పాటు పలువురు నేతలు అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

