డాక్టర్ హేమ్రాజ్ సింగ్
బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ హేమ్రాజ్ సింగ్ సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక వంద పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నపిల్లలతో పాటు వృద్ధులు తప్పనిసరిగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి రావద్దని సూచించారు. గుండె జబ్బు హస్తమా ఉన్నవారు వైద్యుల సలహాలు పాటించాలన్నారు. చలి తీవ్రతతో ఎక్కువ శాతం బ్రెయిన్ స్ట్రోక్, హాట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు లేకపోలేదు అన్నారు. ఎవరైనా వ్యాధుల బారిన పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దని కోరారు.
