25.5 C
Hyderabad

 బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో కొద్ది రోజులు క్రితం డిశ్చార్జ్ అయ్యారు.  గత రాత్రి మరోసారి అనారోగ్యానికి గురికావడంతో ముంబై లోని ఓ  ఆస్పత్రిలో  చేరగా సోమవారం ఆయన  తుది శ్వాస విడిశారు. 1935లో డిసెంబర్ 8న ధర్మేంద్ర జన్మించారు. సుమారు 300కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘షోలే’లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు.  అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్ తదితర చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

More articles

Latest article