కామారెడ్డి, బతుకమ్మ: రెడ్ క్రాస్ సొసైటీ, కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సభ్యులు 50 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. నూతనంగా సభ్యత్వం తీసుకున్న క్లబ్ సభ్యులు 10 మంది కూడా రక్తదానం చేశారు. బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, సెక్రటరీ రఘుకుమార్, ఆర్గనైజర్లు శివ పుట్ట చంద్రశేఖర్, విలాస్, శ్రీకాంత్, రాజు, రవి, మైరు పటేల్, కుమార్ సాయి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
