ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి

0 1,297
  • రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి పీడీఎస్యూ వినతి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  ధర్మారం గురుకుల బాలికల కళాశాలకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని గురువారం పీడీఎస్యూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ.. నిజమబాద్ నగరంలోని పాలిటెక్నిక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా ఉన్నతీకరించాలని కోరామన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో మరియు నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా చేపట్టాలని కోరడం జరిగిందన్నారు. తెలంగాణ యూనివర్సిటీ భూములను రక్షించండని కోరారు. డిచ్పల్లి కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించాలని కోరడం జరిగిందన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చర్ సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర నాయకులు నసీర్, సృజన్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.