బతుకమ్మ,బాల్కొండ: బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ లో మహిళా నిరుద్యోగ యువతుల జాబ్ మేళా ఆదివారం రోజు ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఏస్. కే. ఏస్. ఏస్, కంపెనీ సౌజన్యం తో ప్రముఖ పారిశ్రామిక వేత్త చిట్టాపూర్ గ్రామ వాసి వాలీబాల్ క్రీడా కారుడైన ఏనుగు దయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా నిరుద్యోగులకు జాబ్ మేళ ఆదివారం వసంత ఫంక్షన్ హాల్ చిట్టాపూర్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 100 పైగా మహిళా ఉద్యోగినీలు హాజరైనారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారైనా గోపాల్ కృష్ణ , ఆర్గనైజర్ రాజ్ కుమార్ న్యవనంది గణేష్ ,సందీప్,కే.యన్ డి మూర్తి,మల్లేష్ గౌడ్, సీనియర్ జర్నలిస్టు బి.ఆర్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

