బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రంలో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి 35000/ వేల రూపాయల చెక్కును గడ్డం అశోక్ కి ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందజేశారు. ఈ సందర్భంగా గడ్డం అశోక్ మాట్లాడుతూ మా పేద కుటుంబానికి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా తెలుసుకొని మాకు సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరి ఇప్పించిన బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్,కామణి గణేష్,చుక్కోళ్ల నరేష్,దండేవోయిన ఆశన్న,సున్నపు శ్రీనివాస్,ఎస్ కె రషీద్, దండేవోయిన సాయి,జుంగల గణేష్ ,తునికి గంగాధర్,జుంగల పెద్దోళ్ల శ్రీనివాస్,పడిగెల గంగాధర్,ఎస్.కె సలీం,మదస్తూ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
