నిజామాబాద్ , బతుకమ్మ :
కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్య సంస్థల చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే అదేశాల మేరకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ప్రకటన లో తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం చాల మంది పోటి పడిన చివరకు నరేంధర్ రెడ్డి పేరును ఓకే చేయడం గమనార్హం. కాంగ్రెస్ పార్టి పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మొండి చేయి చూపింది.
