రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన గొండలి శ్రీనివాస్ (40) అను వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రుద్రూర్ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన విరాల ప్రకారం.. బొప్పాపూర్ గ్రామానికి చెందిన గొండలి శ్రీనివాస్ గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసై మృతి చెందినట్లు ఎస్సై మనోజ్ కుమార్ పేర్కొన్నారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు కలరు. మృతుని భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు ఏసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.