25.4 C
Hyderabad

సౌమ్య నాయక్ తండాలో రక్షణ సమావేశం

Safety meeting at Sowmya Naik Thanda

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పాల్గొన్న వివిధ శాఖల అధికారులు

ఇందల్వాయి,  బతుకమ్మ  :

ఇందల్వాయి మండలంలోని చంద్రన్ పల్లీ గ్రామ పంచాయతీ పరిధిలోని సామ్య నాయక్ తండాలో ఇందల్వాయి అటవీ రేంజ్ అధికారి రవి మోహన్ బట్ ఆధ్వర్యంలో రక్షణ సమావేశాన్ని గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఇందల్వాయి ఆటవి రేంజ్ అధికారి రవి మోహన్ బట్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు.అటవీ శాఖ అనుమతులు లేనిది  అటవీ భూములలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించారు.అలాగే ఆటవి ప్రాంతంలోని చెట్లను నరికితే కఠిన చర్య తీసుకుంటామన్నారు.వేటగాళ్లు వన్యప్రాణులను సైతం వేటాడటం నేరమని ఆయన గుర్తు చేశారు, ఎంపీడీవో అనంతరావు మాట్లాడుతూ అటవీ భూములను అన్యక్రాంతం చేయవద్దని హితవు పలికారు. అటవీ చట్టాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు.కార్యక్రమంలో చంద్రన్ పల్లీ తోపాటు, సామ్య నాయక్ తండాకు చెందిన ప్రజలు, వివిధ శాఖలకు చెందిన సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article