. . . ఉపాధ్యాయ దినోత్సవం రోజేనే ఉపాధ్యాయుడు ఆత్మహత్య
కామారెడ్డి, బతుకమ్మ :
ఓ వైపు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డడం కలకలం రేపుతుంది. బిక్కనూర్ మండలం జంగంలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించే అమ్మల లింబాద్రి అనే ఉపాధ్యాయుడు కామారెడ్డి పట్టణంలోని కల్కినగర్ లోని ఆయన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యక పాల్పడ్డాడు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నఉపాధ్యాయుడు లింబాద్రి పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. లింబాద్రి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
