. . . ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి
మెండోరా, బతుకమ్మ :
విద్యార్థులు మత్తుకు బానిసైతే జీవితాలు చిత్తవుతాయని, ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకొని లక్ష్యాన్ని సాధించాలని ఏ సీ పీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మెండోరా మండలంలోని పోచంపాడ్ లో గల రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో బుధవారం ఆర్మూర్ ఏ.సీ.పీ సైబర్ క్రైమ్ అవగాహాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, సైబర్ క్రైమ్ జరిగే విధానాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెండోరా ఎస్సై సుహాసిని, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

