బాల్కొండ, బతుకమ్మ :
బాల్కొండ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా నాలుగున్నర సంవత్సరాలు విధులు నిర్వహించిన కత్రాజీ రమేష్ సేవలు అభినందనీయమని బాల్కొండ తహసీల్దార్ శ్రీనివాస్ కొనియాడారు. డిప్యూటీ తహసీల్దారుగా పదోన్నతి పై ఏర్గట్ల మండలానికి బదిలీపై వెళ్తున్న కత్రాజి రమేష్ ను మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా తహసీల్ధార్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో బదిలీలు పదోన్నతులు సహజమని, ఎక్కడ విధులు నిర్వహించిన అక్కడి ప్రజలకు మంచి సేవలు అందించి, మంచి గుర్తింపు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వనజ, ఆర్ఐ గంగాదర్, జిపివోలు, వీఆర్ఏలు కార్యాలయం సిబ్బంది, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
