27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మద్యానికి బానిసై ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భీమ్ గల్ : గత కొన్ని యేండ్లుగా మద్యం కు బానిసై ప్రతి రోజు మద్యం సేవించే పట్టణానికి చెందిన వ్యక్తి దడివే రాజేందర్ (59) బుధవారం ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రోజు త్రాగి ఇంటికి వచ్చే రాజేందర్ బుధవారం తాగి ఇంటికి రాగా తాగి ఎందుకు వచ్చినావు అని ఆయనభార్య శోభా అడిగినందున కోపంతో ఇంట్లో నుండి వెళ్ళిపోయి పట్టణ శివారులోని అడ్డగుట్ట కు వెళ్లి టేకు చెట్టుకు లుంగీతో ఊరి వేసుకొని మృతి చెందాడు.భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

More articles

Latest article