25.3 C
Hyderabad
Tuesday, August 4, 2026

సొంతింటి కల నెరవేరిన వేళ

Must read

📰 Generate e-Paper Clip

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

ప్రతి ఒక్కరికి సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలి ఆశ ఉంటుందని ఇంటిని నిర్మించుకోవాలనే ఆశ రాష్ట్ర ప్రభుత్వం తీర్చిందని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మండలంలోని దొన్ పాల్  గ్రామంలో సోమవారం రెండు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బండారి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ముత్యాల బాజమ్మ రాములు, ఉప సర్పంచ్ సాయి ప్రసాద్ మాజీ సర్పంచ్ పర్స దేవన్న, కాంగ్రెస్ మండల్ జనరల్ సెక్రెటరీ గడ్డం రవి, విలేజ్ ప్రెసిడెంట్ కోరం కిషన్, కర్నాల నారాయణ, పర్సా దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article