నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగరంలోని హమల్ వాడి తర్ప మేరు సంఘంలో 15 వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సోమన్మంతరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి తాళ్ల నర్సింలు, నగర అధ్యక్షులు వెన్ను దేవానంద్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు పుట్టకోట పాండు, నగర సంయుక్త కార్యదర్శి తాళ్ల శివకుమార్, తర్ప అధ్యక్షులు తాళ్ల సాయికుమార్, ప్రధాన కార్యదర్శి టెంపుల్ వారి బాలాజీ, కోశాధికారి సంఘీ వారి ప్రసాద్, గట్ల సత్యం, మేరు కులస్తులు పాల్గొన్నారు.
