23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

బొబ్బిలి చెరువులో పడి ఒకరు మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

తల్లి మందలించిందని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే జిల్లెల్ల బాపురెడ్డి (25) వరి ధాన్యం ఆరబెట్టి విషయంలో తల్లితో గొడవపడి నీకు పనిచేయడం చేతకాదని తల్లి మందలించగా, కోపంతో ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళిపోయాడు. రాత్రి ఎంత వెతికినా దొరకలేదు. శనివారం ఉదయం గ్రామ శివారులో బొబ్బిలి చెరువులో అతడి మృతదేహం లభించింది. ఈ సంఘటన తెలుసుకున్న భిక్కనూరు పోలీసులు డెడ్ బాడీని బయటకు తీసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి మృతదేహం తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

More articles

Latest article