మోర్తాడ్, బతుకమ్మ :
ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మోర్తాడ్ మండలంలోని దోన్ పాల్ గ్రామంలో పశువైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో 48 గేదెలకు వైద్యం అందించారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, గ్రామ సర్పంచ్ ముత్యాల బాజమ్మ, వీడీసీ అధ్యకులు పర్సా రాజేందర్, ఉపాధ్యకులు టి. రాజేందర్, పర్సా దేవేందర్, రేసం రాజేందర్, కూర్మ రమేష్, కోరం సాయికుమార్, ఎం. రాజశేఖర్, శ్రీనివాస్, సిహెచ్ సాయికిరణ్, పశువైద్యాధికారి డా.గౌతమ్ రాజు, సిబ్బంది షేక్, ప్రభాకర్, జమీల్ తదితరులు పాల్గొన్నారు.

