. . . లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టివేత
హైదరాబాద్, బతుకమ్మ :
హైదరాబాద్ జిహెచ్ ఎంసీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీలత ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. ఓ ఇంటి నిర్మాణానికి సంబంధించి.. క్లియరెన్స్ అనుమతులు ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసింది. చివరకు లక్ష ఇస్తేనే క్లియరెన్స్ ఇస్తానని మొండికేసింది. దాంతో బాధితుడు ఏసిబికి ఫిర్యాదు చేయగా సోమవారం లక్ష రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది.
