27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

స్వీయ జనగణన చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) లో పాల్గొని వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన 2027 లో భాగంగా తెలంగాణలో ఆదివారం నుంచి ఆన్‌లైన్‌లో స్వీయ గణన ప్రారంభమైంది. జన గణన వెబ్‌సైట్‌లో ముఖ్యమంత్రి వివరాలను స్వీయ నమోదు చేసుకున్నారు.

 

CM Revanth Reddy conducts his own census

 

అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో ప్రజలంతా విశేషంగా పాల్గొనాలని వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జనాభా లెక్కల కార్యక్రమంలో ముందుగా చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించి సెన్సస్ అధికారులు ముఖ్యమంత్రి కి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనగణన ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, ఆర్వీ కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక అల, ఐపీఆర్ కమిషనర్‌ సీహెచ్ ప్రియాంక తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

CM Revanth Reddy conducts his own census

More articles

Latest article