. . . 35 మందికి భారీ జరిమానా
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 41 మందిని అరెస్ట్ చేసినట్టు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ పి. ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం శనివారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ వద్ద హాజరుపరచగా 35 మందికి ఒకరికి రూ.10,000 చొప్పున రూ.3,50,000 జరిమనా విధించారన్నారు. దిలరన్ పత్రే, బోరే రాజు, మేకపతి చంద్ర శేఖర్, షేక్ హుస్సేన్, సురారం సంజీవ్, దాసరి శ్రీకాంత్ అనే ఆరుగురికి మాత్రం వారం రోజుల జైలు శిక్ష విధించినట్టు ఆయన పేర్కొన్నారు.
