నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ అసోసియేషన్ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా గొల్లపల్లి మానస రాజుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మనస మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన శాయశక్తుల కృషి చేస్తానని, ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
