నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజలు, పోలిస్ సిబ్బంది నహకారంతోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాదు, బోధన్, ఆర్మూర్, భీంగల్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఫిబ్రవరి 11 వరకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు శాంతి భద్రతల కోసం ఎనలేని కృషి చేశారని, వ్రజలు, పోలీసు అధికారుల మధ్య సమన్వయంతోనే ఈ ఎన్నికలు నజావుగా నిర్వహించబడ్డాయని ఆయన తెలిపారు.
