నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన ముగ్గురికి జైలు శిక్ష విధించినట్టు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 17 మందిని పట్టుకోగా ఏసీపీ ఆదేశానుసారం శుక్రవారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన అనతంరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ముందర హాజరుపరచగా 14 మందికి ఒకరికి 10,000/- చొప్పున రూ. 140,000/-జరిమానా విదించారు. షైక్ సుజాత అహ్మద్, గుండెటి శివకృష్ణ, మామినో మల్లేష్ అనే ముగ్గురికి జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. కావున ప్రజలు మద్యం తాగి వాహనాలు నడపకూడదని, వాహనానికి సంబందించిన పత్రాలు అన్ని అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
