ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పెంబడి స్వర్ణకు ఆపరేషన్ కోసం కావాల్సిన రూ. 2 లక్షల ఎల్ఓసి చెక్కును బీజేపీ నాయకులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారిలకు లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జెల్లెల్ల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు సాంబారు రవి, వార్డు సభ్యులు దశరథం, రాజేశ్వర్, గంగాధర్ గౌడ్, రాజమోహన్, సీనియర్ నాయకులు జలేందర్, పెద్ద లింబాద్రి, అనిల్, నారాయణ, రవి, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
