రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్ సీ కాలనీలో గల అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం ఉదయం రెండు కార్లు ఢీ కొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని నుంచి బోధన్ వైపు వెళ్తున్న ఎర్టిగా కారు TS 08 HN 3786, బోధన్ నుంచి వర్ని వైపు వస్తున్న షిఫ్ట్ డిజైర్ కారు AP 10 AZ 5077 రెండు కార్లు ప్రమాదవశాత్తు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడం ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

