డిల్లీ, బతుకమ్మ : నూతన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్(CIC)గా మాజీ ఐఏఎస్ రాజ్కుమార్ గోయల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. డిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాజ్కుమార్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర సిబ్బంది శాఖ మంత్రి జితేందర్ సింగ్ తదితరులు హాజరయ్యారు. అదనంలో మరో 8 మందిని సమాచార కమిషనర్లుగా నియమించారు. వీరంతా తర్వలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


