డిల్లీ, బతుకమ్మ : కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి డిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరిచే కుక్కలంతా పార్లమెంట్లో ఉన్నారని వ్యాఖ్యనించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తన కారులో తన పెంపుడు కుక్కని తీసుకుని పార్లమెంట్ భవనానికి రేణుకా చౌదరి వెళ్లింది. పెంపుడు కుక్కను తీసుకురావడంపై బీజేపీ ఎంపీలు ఆమెపై విమర్శలు చేశారు. దీంతో అది కరిచే కుక్క కాదు, కరిచే వాళ్లంతా లోపల ఉన్నారంటూ రేణుకా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
