23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు లలెందర్ అనారోగ్యం కారణంగా మృతి చెందారు. బుధవారం బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. అనంతరం ఫ్రూట్ యూసుఫ్ ఇంటికి వెళ్లి బాబాన్ బాయ్ కుమారుని ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుని,  ఆర్ధిక సహాయం అందించారు. మాజీ ఎమ్మెల్యే వెంట రుద్రూర్ మండల బీఆర్ఎస్ పార్టీ  ఇంచార్జ్ గాండ్ల మధు, పార్టీ నాయకులు దౌర్ సాయిలు, శేఖర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article