నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఆపదమిత్ర వాలంటీర్స్ గా మాకు అంటు ప్రత్యేక గుర్తింపు లేదని, శిక్షణ తీసుకున్న ఆపదమిత్ర వాలంటీర్లకు గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్, టూల్ కిట్ ఇవ్వాలని సోమవారం ప్రజావాణిలో ఆపద మిత్ర వాలంటీర్లు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఆపదమిత్ర వాలంటీర్లకు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు బ్యాచ్ కు 100 మంది చొప్పున మొత్తం మూడు బ్యాచులుగా 300 మందికి న్యాక్ భవనంలో శిక్షణ ఇచ్చారని తలిపారు. ఇప్పటి వరకు ఐడి కార్డులు, సర్టిఫికెట్లు, టూల్ కిట్లు ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికైనా ఇవ్వవలసిందిగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆపద మిత్ర వాలంటీర్లు సాయి కుమార్, నవీన్ కుమార్, నరేష్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
