నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మద్యం తాగి వాహనాలు నడిపిన 40మందిలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ 8మందికి జైలు శిక్ష, 32మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 40మందికి శనివారం కౌన్సిలింగ్ నిర్వహించి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. వారిలో 8మందికి వారం రోజుల జైలు శిక్ష, 32 మందికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రూ.3,20,000 జరిమానా విధించినట్లు తెలిపారు.
