28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రైలు ఢీకొని ఒకరి మృతి 

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి,బతుకమ్మ : 

ఇందల్వాయి మండల పరిధిలోని ఇందల్వాయి రైల్వే గేటు వద్ద సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆర్పిఎఫ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుడి వివరాలు సేకరించగా యువకుడి చేతి పై సురేష్ అని రాసి ఉందని తెలిపారు. మృతి చెందిన యువకుడి శరీర భాగాలు విడివిడిగా పడి ఉండడంతో గుర్తుపట్టలేని విధంగా ఉందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం కొరకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి శవ పంచనామకు తరలించారు.దీంతో ఆర్పిఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

More articles

Latest article