మెండోరా, బతుకమ్మ: గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచాలని అది అందరి బాధ్యతను ప్రతి ఒక్కరి తమవంతు బాధ్యతగా ముందుకు రావాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ పాండే అన్నారు. బుధవారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గోదావరి పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసే కార్యక్రమం నిర్వహించి అనేకులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సభ్యులు రంగరాజన్, ఈ ఈ ఏం. వేణుగోపాల్, ఈ ఈ సీ పద్మిని, డీ ఈ ఈ షర్మిల, మహమ్మద్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఈ ఈ చక్రపాణి, డీ ఈ ఈ సుకుమార్, డీ ఈ ఈ సురేష్, ఏ ఈ ఈ రవి తదితరులు పాల్గొన్నారు.

