26.2 C
Hyderabad
Monday, August 3, 2026

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై సునీల్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : మత్తు పదార్థాలు,సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ పేర్కొన్నారు.మంగళవారం కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు,సైబర్ మోసా లపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై సునీల్ మాట్లాడుతూ..సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే మమ్మల్ని సంప్రదించాలని సూచించా రు.మత్తు పదార్థాల విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని.వాటివల్ల ఏర్పడే దుష్ప్రభావాలు తీవ్రంగా ఉంటాయని సూచించారు.ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్,సిబ్బంది,పోలీస్ సిబ్బంది,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article