26.2 C
Hyderabad
Monday, August 3, 2026

స్కూటీలో నుంచి నగదు చోరీ

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : స్కూటీలో నుంచి సినీ పక్కిలో భారీ నగదు చోరీ జరిగిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకుంది. బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ బ్యాంకులో బంగారం కుదువపెట్టి తెచ్చిన రూ.లక్షన్నర నగదును స్కూటీ డిక్కీలో డబ్బులు పెట్టి వసతి గృహంలో పనిచేసేందుకు వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి స్కూటీ డిక్కీలో డబ్బులు కనిపించలేదు. అప్పటికే లక్షన్నర నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఆందోళన చెందిన బాధితురాలు రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

More articles

Latest article