29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కళాకారిణి శ్రీవల్లిని సన్మానించిన ఎమ్మెల్యే వేముల

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : కూచిపూడి, ఆంధ్ర నాట్యంలో ప్రతిభ గనబర్చిన మండలంలోని కోమన్ పల్లికి చెందిన శ్రీవల్లిని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఘనంగా సన్మానించారు. సావిత్రి బాయి ఉమేన్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మలేసియా లో ఈ నెల 28న నిర్వహించిన బతుకమ్మ, దసరా సంభారలలో భాగంగా నిర్వహించిన శాస్త్రీయ నృత్య పోటిల్లో ఈమె కూచిపూడి, ఆంధ్ర నాట్యంలో ప్రతిభ కనబర్చింది. దాంతో శ్రీవల్లికి షాలువను కప్పి సత్కరించి, అశీర్వదించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిరంజీవి శ్రీవల్లి శాస్త్రీయ నృత్యం లో ఉన్నత శిఖరాలను ఆదిరోయించాలని అన్నారు. మన భారతీయ సంసృతిని, సాంప్రదాయాలను తన నృత్యంతో విశ్వ వ్యాప్తి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

More articles

Latest article