- మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా
రుద్రూర్ (వర్ని), బతుకమ్మ : వర్ష కాలంలో రైతులు వరి కోసిన తరువాత వడ్లను ఎండబెట్టటానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇక మీదట రైతులు ఇబ్బందులు పడకూడదని పచ్చి ధాన్యంను డ్రై చేయటానికి డ్రై మిషన్ ను ఏర్పాటు చేయాలనీ 13 లక్షల 70 వేల రూపాయలతో డ్రై మిషన్ ను వ్యవసాయ మార్కెట్ కమిటీకి కొనుగోలు చేసి వితరణ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని అన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
