భీమ్ గల్, బతుకమ్మ : ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సతీమణి రేవతి రెడ్డి లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మినర్సింహా స్వామి వారిని బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నర్సయ్య పంతులు, విష్ణు పంతులు ఆమెను సాధారంగా ఆహ్వానించి, గర్భలయంలో ప్రత్యేక పూజలను నిర్వహింపజేశారు. సంకల్పం, హారతి, ప్రసాదంనిచ్చి వేద మంత్రాలతో ఆశీర్వాదించారు. అనంతరం వారిని స్వామి వారి శేష వస్త్రంతో సన్మానించారు. వారి వెంట బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబెర్ యోగేశ్వర నర్సయ్య, కిసాన్ మోర్చా అధ్యక్షులు నీలం గంగాధర్, బోదిరే అశోక్,బిజీ మోహన్ తదితరులు ఉన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే సతీమణి


