27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లా సెషన్స్ కోర్టు పి.పి గా రాజారెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కోర్టు ఇంచార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది, పొక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాదస్తు రాజారెడ్డి ని నియమిస్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీచేశారు. పొక్సో కోర్టు స్పెషల్ పి.పి గా ఉన్న ఆయన జిల్లా సెషన్స్ కోర్టులో పోలీసుల తరపున క్రిమినల్ కేసులను ప్రాసిక్యూషన్ నిర్వహిస్తారు.రాజారెడ్డి గతంలో జిల్లా సెషన్స్ కోర్టు పబ్లిక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా మూడేళ్లపాటు విధులు నిర్వహించారు.మాదస్తు నియామకం పట్ల తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, బార్ అధ్యక్షుడు జగన్ మోహన్,న్యాయవాదులు హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు

More articles

Latest article