వరంగల్, బతుకమ్మ : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా లకావత్ కల్పన విధులు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులు భరించలేక తహసీల్దార్ కార్యాలయంలో కల్పన సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. కార్యాలయ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మాధవరెడ్డి అండదండలు చూసుకుని వేధింపులు, అక్రమ పనులు చేస్తున్నారని కల్పన బంధువులు ఆరోపించారు. తన సూసైడ్ కు కారణం చరణ్ సింగ్, మాజీ ఎంపీటీసీ మేడిపల్లి మాలోత్ మోహన్, పై అధికారులే కారణమని కల్పన సూసైడ్ లెటర్ లో పేర్కొంది. మాలోతు చరణ్ సింగ్ మానసికంగా, లైంగికంగా వేధించాడని ఆరోపించింది. మాలోత్ చరణ్ సింగ్, మాజీ ఎంపీటీసీ మాలోతు మోహన్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.


