బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు శివారులోని విజయ గణపతి రైస్ మిల్లులో టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా శుక్రవారం తనిఖీలు చేపట్టారు. రైస్ మిల్లులో ఉన్న ధాన్యం నిల్వలను రికార్డులను పరిశీలించారు. రైస్ మిల్ యాజమాన్యం తప్పకుండా నిబంధనలు పాటించాలని లేని యెడల చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్సు ఓ ఎస్ డి సుదర్శన్ రెడ్డి, సిబ్బంది శ్రీనివాసరావు కిష్టయ్య పోలీసులు పాల్గొన్నారు.
