కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాల ఎంపిక అవార్డుకు 41 మంది ఉపాధ్యాయులు ఎంపికైనట్లు విద్యా అధికారులు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవ పురస్కరించుకొని జిల్లా స్థాయిలో వివిధ జిల్లా కమిటీల ద్వారా ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు సోమవారం మధ్యాహ్నం ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సమీకృత జిల్లా కార్యాలయంలో గల సమావేశ మందిరం లో అవార్డు ప్రథనోత్సవ కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు సకాలంలో కార్యాలయానికి వచ్చి బహుమతిని అందుకోవాలని పేర్కొన్నారు.
