నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలంలోని విద్యా వనరుల కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సన్మాన మహోత్సవంలో 12 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ శ్రీనివాస్ రావు, ఎమ్మార్వో సంతోష్, నందిపేట్ మండల విద్యాధికారి అవధూత గంగాధర్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగోని కిషన్, పీఆర్టీయూ మండల అధ్యక్షులు ఐలభూషణ్, ప్రధాన కార్యదర్శి జీడి రమేష్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంగాధర్, శర్మ, ప్రసాద్, భోజరాం, చిన్నారెడ్డి, నర్సారెడ్డి, అబ్దుల్, నరేష్, వైస్ ప్రెసిడెంట్ బండి ప్రసాద్, కార్యదర్శి హనుమాన్లు, మండల బాధ్యులు మైకేల్, వినోద్, అన్వర్, పద్మ, శ్రీదేవి, వివిధ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
