నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శుక్రవారం నిర్వహించిన లడ్డూ వేలం పాటలో భారీ ధర పలికింది. సిరిగా ప్రసాద్ రూ.12,500లకు లడ్డూను దక్కించుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతడ్పుల రామక్రిష్ణ, కార్యదర్శి బైరి శేఖర్, ఉత్సవ కమిటీ కన్వినర్ మండే మోమన్, ఇతర జర్నలిస్టులు ఆయనకు లడ్డూను అందజేసి అభినందనలు తెలిపారు.
